అల్పులు కాదు .. అన్నదాతలు

కల్లా కపటం తెలియని రైతులపై రాజధాని కుట్రలెందుకు? రాజధాని కోసం ప్రాణ నినాదం చేస్తున్న అన్నదాతలకు అండగా నిలుద్దాం – అభినవ తుగ్లక్ తో అమరావతి రైతుల పోరాటం అజరామరం పంట పొలాలను పసిపాపల్లా చూసుకుంటూ..కుటుంబ కోసం అహర్నిశలు పని చేయడమే తప్ప ఆ తల్లులు ఏ రోజు ఊరు దాటింది లేదు.. రాష్ట్రానికి మేలు జరుగుతుందంటే నమ్మి మనస్ఫూర్తిగా బంగారం పండే భూములను ప్రభుత్వానికి ఇచ్చారు కానీ ఆ అన్నదాతలకు ఏ కల్లాకపటం తెలియదు.. నమ్మకద్రోహం,…

Read More

బిజెపిలో చేరిన చదలవాడ సుచరిత

మాజీ ఎమ్మెల్యే, మాజీ టిటిడి బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సతీమణి చదలవాడ సుచరిత బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో బిజెపి రాష్ట్ర కార్యాలయం లో కమలం పార్టీ లో చేరారు. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి తదితరులు సమక్షంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కాషాయ కండువా కప్పారు.బిజెపి జాతీయ భావాలు ఆకర్షించి బిజెపి లో చేరానని సుచరిత ఈసందర్భంగా అన్నారు

Read More

మాజీ సీఎం కేసీఆర్ పై కేసు నమోదు చేయండి

– ఇద్దరు ఐఐఎస్ అధికారుల పైన కేసు పెట్టండి – చీఫ్ సెక్రటరీకి తప్పని కేసుల బెడద – తెలంగాణ హైకోర్టు ఆదేశం హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్సెలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా గురువారం హైకోర్టు ఆదేశించింది. అప్పటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్, ప్రధాన కార్యదర్శిపైనా కేసులు నమోదు చేయాలంటూ రాష్ట్ర అవినీతి…

Read More

ఓటు పుట్టినరోజు..

వెచ్ఛవెచ్ఛని పచ్ఛనోట్టు వెతుకుతున్నాయ్ అనుకూలమైన మనిషి కోసం అప్పుడే బయలుదేరింది నోటు వేటకు బలహీనుడుండే చోటుకు అస్థిపంజరాలను కూడ వదిలరు వాల్లు ఊపిరుంటే చాలు ఉరికురికి వస్తారు ఊరవతల నీవున్న సిరాచుక్క వేలుకేసి సారాయి సుక్క నోట్లో పోసి సికెనుముక్క చేతికిచ్చి హద్దులెరుగని సుద్ధులెన్నో చెప్పి అభివృద్ధిని అద్దంలో చూపిస్తు అందలం ఎక్కేస్తారు పథకాల పంజరంలో నిన్నుంచి పదవులెన్నో పొందుతారు గెలిసినాంక గేలిచేసి గేటు తాళమేస్తారు అపాయిట్మెంట్ లేదంటు ఆయిట్మెంట్ పూస్తారు యాచించకు ఓ మనిషి ఆలోచించు…

Read More

దేశ భివిష్యత్తు యువ ఓటర్లపైనే ఆధారపడి ఉంది

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి -కండబలం, ధనబలం ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తోంది -జాతీయ ఓటరు దినోత్సవం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అమరావతి : ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. స్థానిక కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా జరిగింది.ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయిన ఆమె విద్యార్దులనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనకు లభించిన…

Read More

అయోధ్య కంటే 5 రెట్లు పెద్ద శ్రీరామ దేవాలయం

భారత్‌లో ఎక్కడ నిర్మిస్తున్నారో తెలుసా? జనవరి 22న అయోధ్యలోని శ్రీరామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. ఐతే అయోధ్య రామ మందిరం కంటే ఐదు రెట్లు పెద్ద రామ మందిర నిర్మాణం కూడా ప్రారంభమైంది. ఈ ఆలయాన్ని కంబోడియాలోనో లేక అమెరికాలోనో కాదు, భారత్‌లో ఎక్కడ నిర్మిస్తున్నారో తెలుసుకుందాం. ఈ కొత్త దేవాలయం, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దేవాలయం కాబోతోంది. ఆలయ నిర్మాణ ప్రణాళిక ప్రకారం, ఈ ఆలయం 125 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంటుంది….

Read More

ప్రతీ పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందే

– సుప్రీంకోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టు ఊహించని ఆదేశాలు జారీ చేసింది.ప్రతీ పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అన్ని పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను సుప్రీంకోర్టు ఆదేశించింది.ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎన్ని మాటలు చెప్పినా సామాన్య ప్రజలకు పోలీస్ స్టేషన్లలో దారుణమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. అధికారం ఉన్నవారికి.. డబ్బులు ఉన్నవారికి పోలీసులు కొమ్ముకాస్తూ.. సామాన్యులపై ఉక్కుపాదం…

Read More

ఆర్టీసీ బస్సు కిటికీలో ఇరుక్కున్న ఓ వ్యక్తి తల

టెక్కలి ఇందిరా గాంధీ జంక్షన్ వద్ద బుధవారం ఓ వ్యక్తి తల బస్సు కిటికీలో ఇరుక్కుంది. సంతబొమ్మాలికి చెందిన సుందర్ రావు అనే వ్యక్తి ఉమ్ము ఉసెందుకు ఆర్టీసీ బస్సులో ఉన్న ఎమర్జెన్సీ కిటికీ డోర్ నుంచి తల బయటకు పెట్టాడు. ఇంకేముంది ఒక్కసారిగా కిటికీ సందులో తల ఇరుక్కుపోయి సుమారు 15 నిమిషాలు అవస్థలు పడ్డారు. తోటి ప్రయాణికులు గుర్తించి డ్రైవర్కు విషయం తెలపడంతో బస్సును టెక్కలిలో ఆపి స్థానికుల సహాయంతో తలను బయటకు తీశారు.

Read More

రాజధాని రైతుల ధీరత్వానికి ఉధ్యమాభివందనాలు

– మహిళా మణులకు పాదాభివందనాలు – రాజధాని కోసం పోరాడుతున్న రైతున్నలకు కేడీల పాలనలో బేడీలు – దేశంలోనే 1500 రోజుల పాటు ఉద్యమించిన చరిత్ర అమరావతి రైతులకే దక్కుతుంది -టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజా రాజధాని అమరావతి విధ్వంసానికి శ్రీకారం చుట్టి జనవరి 25 నాటికి 1500 రోజులు పూర్తవుతుంది. రాష్ట్ర భవిష్యత్ కోసం నిర్మించ తలపెట్టిన అమరావతిని పూర్తి చేయలేని పాలకులు మూడు రాజధానులంటూ రాష్ట్రం పరువు తీశారు. ఏపీకి రాజధాని…

Read More

ప్రజల భూములు దోచుకోవడానికే తుగ్లక్ చట్టాలు

– మాజీమంత్రి దాడి వీర భద్రారావు దొంగ చేతికి తాళాలు అప్పగించిన విధంగా ప్రజల రెవెన్యూ రికార్డులు మొత్తం వైసీపీ నేతలకు అప్పగించేందుకే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌, భూ సమగ్ర సర్వేలను  వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాలు ప్రజల రెక్కల కష్టంతో సంపాదించిన ఆస్తులు దోచుకోవడానికే. న్యాయ వ్యవస్థను కాదని రెవెన్యూ వ్యవస్థకు ఏ విధంగా అధికారం ఇస్తారు? రెవెన్యూ శాఖకు అధికారాలు అప్పగిస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఏ విధంగా ఉంటుంది?…

Read More