రెండు హెలికాప్టర్లు ఢీ

మలేసియాలో ఘోర ప్రమాదం మలేసియాలో ఘోర ప్రమాదం సంభవించింది. నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు గగనతలంలో ఢీకొనడం వల్ల 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మలేసియాలో ఏప్రిల్ 26న రాయల్ మలేసియన్ నేవీ దినోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా పెరక్‌లోని లుమత్‌ ప్రాంతంలో రిహార్సల్స్‌ నిర్వహించారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం శిక్షణ విన్యాసాల కోసం గాల్లోకి ఎగిరిన…

Read More

ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా నారా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో గల్ఫ్‌ టీడీపీ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, ఎన్నారై నాయకులు కే శేషుబాబు, కోడూరి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నారా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వం రాష్ట్రానికి అవసరమని వారు అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తుందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే ప్రజలు ఆశించిన…

Read More

దుబాయ్‌లో వర్ష బీభత్సం

వర్ష బీభత్సానికి దుబాయ్‌ విలవిలలాడిపోతోంది. కేవలం గంటన్నర వ్యవధిలో అంటే 90 నిమిషాల్లో.. ఏడాదిలో కురవాల్సిన వర్షమంతా ఒకేసారి కురిసింది. మాల్స్ అన్నీ నీటితో నిండిపోయాయి. దుబాయ్ ఎయిర్ పోర్టులోనూ వర్ష బీభత్సం ప్రత్యక్షంగా కనిపించింది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బయటి రోడ్లను చూస్తే అవి చెరువులను తలపించాయి. సబ్ వేలన్నీ నీట మునిగాయి. రోడ్లపై నిలిపివుంచిన కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్…

Read More

ఫ్లోరిడాలో ఉగాది వేడుకలు

– తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) వారు నిర్వహించిన 2024 ఉగాది వేడుకలు అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) వారు నిర్వహించిన 2024 ఉగాది వేడుకలలో ప్రముఖ ఆకర్షణగా నిలిచింది “జయంత విజయం” పద్యనాటకం. ఓర్లాండో ప్రవాసాంధ్రులను మంత్రముగ్ధులను చేసిన ఈ నాటకం నాటి, నేటి తరాలను అలరించే విధంగా రూపుదిద్దబడింది. మహాభారతంలో అత్యంత కీలకమైన విరాటపర్వం ఘట్టాన్ని కేంద్రీకరించుకుని ప్రదర్శితమైన ఈ రంగస్థల దృశ్యకావ్యం, భారతీయ…

Read More

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ డ్రోన్ల దాడి

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ డ్రోన్‌ల దాడి ప్రారంభించింది. డజన్ల కొద్ది డ్రోన్లను ప్రయోగించింది. అవి లక్ష్యాలను చేరుకోవడానికి గంటల కొద్దీ సమయం పడుతుందని, వాటిని ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్‌ మిలటరీ తెలిపింది. అయితే వీటిల్లో కొన్నింటిని సిరియా లేదా జోర్డాన్‌ మీదుగా ఇజ్రాయెల్‌ కూల్చి వేసింది. ఇజ్రాయెల్‌, జోర్డాన్‌, లెబనాన్‌, ఇరాక్‌ వాటి గగనతలాన్ని మూసి వేశాయి.

Read More

అమెరికాలో భద్రాచలం తరహా రామాలయం

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్‌ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు, దాతల సహకారంతో 33 ఎకరాల్లో రూ.300 కోట్లతో ఆలయ పనులు చేపట్టినట్లు వివరించారు. తోటి అర్చకులతో భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయ ప్రధానార్చకుడు సీతారామానుజాచార్యులతో పాటు కొంతమంది వైదిక పెద్దలను కలిసి సలహాలు తీసుకున్నారు. అట్లాంటాలో రామాలయ పనులు సాగుతున్నాయని, ప్రధాన కోవెల విడిభాగాలను మాత్రం ఆంధ్రప్రదేశ్‌‌లోని…

Read More

తైవాన్ లో భారీ భూకంపం

-రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.4 -వంగిపోయిన నివాస సముదాయం -బిల్డింగుల్లో పగుళ్లు -మియాకో, యేయామా ద్వీపాలకు కూడా సునామీ ముప్పు -1999 తర్వాత తైవాన్‌ను ప్రభావితం చేసిన అతిపెద్ద భూకంపం ఇదే -పరిసర దేశాలు అలర్ట్! తైవాన్ రాజధాని తైపీలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.4గా నమోదైంది. దీంతో అధికారులు తైవాన్తో దక్షిణ జపాన్ ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తైవాన్‌ రాజధాని తైపీని భారీ భూకంపం వణికించింది….

Read More

సముద్రంలో కుప్పకూలిన రష్యా యుద్ధ విమానం

రష్యాకు చెందిన ఓ యుద్ధవిమానం ఉక్రెయిన్ సమీపంలోని క్రిమియా ద్వీపకల్పం వద్ద కుప్పకూలింది. ఈ మేరకు సెవస్టొపోల్ గవర్నర్ మిఖైల్ రాజ్వోజైవ్ టెలిగ్రామ్‌లో తెలిపారు. ‘పైలట్ ఎజెక్ట్ అయ్యారు. అతడిని సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రాణానికేం ప్రమాదం లేదు’ అని స్పష్టం చేశారు. మంటల్లో మండుతూ ఆ విమానం కుప్పకూలుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Read More

మైక్రోసాఫ్ట్ కంపెనీలో మరో భారతీయుడికి కీలక హోదా

– విండోస్ ఆపరేటింగ్ సిస్టం, సర్ఫేస్ విభాగాలకు అధిపతిగా పవన్ దావులూరి మైక్రోసాఫ్ట్ కు ఇప్పటికే భారతీయుడైన సత్య నాదెళ్ల సీఈవోగా ఉండగా.. తాజాగా మరో భారతీయుడు ఐదే మైక్రోసాఫ్ట్ సంస్థలో అగ్ర పదవిలో నియమితులయ్యారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టం, సర్ఫేస్ విభాగాలకు అధిపతిగా ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని మైక్రోసాఫ్ట్ కంపెనీ నియమించింది. పవన్ దావులూరి 2001 నుంచి మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గడిచిన మూడేళ్లుగా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు.

Read More

అబార్షన్ రాజ్యాంగ హక్కు

– ఫ్రాన్స్ చారిత్మాత్మక నిర్ణయం – పార్లమెంట్‌లో భారీ మెజారిటీతో ఆమోదం పొందిన బిల్లు – ‘మీ శరీరం మీది. ఇంకెవరూ నిర్ణయం తీసుకోలేరు’ అన్న ప్రధాని గాబ్రియేల్ – హర్షం వ్యక్తం చేస్తున్న మహిళా హక్కుల కార్యకర్తలు ఇప్పుడు అక్కడ అబార్షను నేరం కాదు. ఘోరం అంతకన్నా కాదు. ‘మీ శరీరం మీ ఇష్టం’ అన్నది, ఆ దేశం మహిళలకు కొత్తగా ఇచ్చిన స్వేచ్ఛానినాదం. ఆరకంగా ఫ్రాన్సు మహిళలు, ఇక ఇష్టం వచ్చినప్పుడు అబార్షున్లు చేయించుకోవచ్చు….

Read More