నమస్కారం విలువ
మహాభారత యుద్ధ సమయంలో “మీరు పక్షపాతంగా యుద్ధం చేస్తున్నారు” అని దుర్యోధనుడు అనిన వ్యంగ్యమైన మాటలకు బాధపడి భీష్మ పితామహడు “నేను రేపు పాండవులను చంపుతాను” అని ప్రకటించాడు. అంతే… పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది. భీష్ముని సామర్ధ్యం గురించి అందరికీ తెలుసు కాబట్టి, చెడు భయంతో కలవరపడ్డారు. అప్పుడు.. శ్రీ కృష్ణుడు తన వెంట ద్రౌపదిని తీసుకొని భీష్ముని శిబిరానికి వెళ్ళాడు. తను బయట నిలబడి ద్రౌపదితో “నీవు వెళ్లి భీష్మునికి నమస్కరించు, ఆయన “అఖండ…