భర్త ఆఖరి ఉత్తరం…
వృద్ధాప్యం దరి చేరిన వారు తప్పక చదవాల్సిన ఓ జరిగిన కథ… పది రోజుల నుండి బంధువులు, పిల్లల తోటి, కర్మకాండలతో హడావిడిగా ఉన్న ఇల్లు ఒక్కసారి అందరూ వెళ్లిపోవడంతో నిశ్శబ్దం అయిపోయింది. ముప్పై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, ఎందరికో విద్యాబోధన చేసి, పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి, రెండు సంవత్సరాల క్రితమే పదవీ విరమణ చేసి, హాయిగా కాలక్షేపం చేస్తున్న శంకరరావు సార్ సడన్ గా కాలం చేయడంతో భార్య పార్వతమ్మ ఒంటరిది అయిపోయింది….