ఐఏఎస్ అధికారి కొడుకు ప్రభుత్వ పాఠశాలలో….

ప్రభుత్వ పాఠశాల అంటే అందరిలో ఓ రకమైన చిన్నచూపు. ప్రభుత్వ పాఠశాల అంటే చదువు బాగా చెప్పరు అనే భావన వచ్చేసింది. అందుకనే చాలా మంది తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించడానికి ఇష్టపడరు.ఇక ప్రభుత్వాధికారుల గురించి చెప్పేదేముంది.. ప్రభుత్వ ఉద్యోగం కావాలి గానీ.. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించడానికి అంతగా ఆసక్తి చూపరు అన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు అభివృద్ధి చేయాలని ఆయా అధికారులు ప్రసంగాలలో చెబుతారు కానీ వారి పిల్లలు మాత్రం మంచి పేరున్న కాన్వెంట్ స్కూల్ లోనే చేర్పిస్తూ.. ఉంటారు కానీ ఇక్కడ ఒక ఐఏఎస్ అధికారి మాత్రం.. తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాల్లో చేర్చించి..అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటిడిఎ పిఓ కూర్మనాథ్ పదవ తరగతి చదువుతున్న తన కుమారుని కొత్త పోలమ్మ పురపాలక పాఠశాలలో చేర్పించాడు. అయితే ఇక్కడ ఎంతో అనుభవం గల ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి విద్యార్థులకు ఎంతో మనో వికాసం సాధించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో అవకాశం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.తాను ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిన తన కుమారుని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరుస్తానన్నాడు.