దాసరి పెద్దరికం కోసం పోరు?
చిరంజీవి-బాలయ్య చిటపటలు దానికోసమేనా?
బాలయ్య లేకుండా కేసీఆర్ను అందుకే కలిశారా?
దాసరి స్థానంపై చిరు కన్నేశారా?
సిని‘మా’ అసోసియేషన్ ఉత్సవ విగ్రహమేనా?
సినిమా రేట్లు పెంచే కుట్ర జరుగుతోందా?
టాలీవుడ్లో ఎవరి దుకాణం వారిదే!
(మార్తి సుబ్రహ్మణ్యం)
చిరంజీవి-బాలయ్య చిటపటలు దానికోసమేనా?
బాలయ్య లేకుండా కేసీఆర్ను అందుకే కలిశారా?
దాసరి స్థానంపై చిరు కన్నేశారా?
సిని‘మా’ అసోసియేషన్ ఉత్సవ విగ్రహమేనా?
సినిమా రేట్లు పెంచే కుట్ర జరుగుతోందా?
టాలీవుడ్లో ఎవరి దుకాణం వారిదే!
(మార్తి సుబ్రహ్మణ్యం)
సినిమా పరిశ్రమకు పెద్దదిక్కు ఎవరని ప్రశ్నిస్తే.. ‘ఇంకెవరూ..? దాసరి నారాయణరావు’ అని మూకుమ్మడిగా ఠక్కున సమాధానమొస్తుంది. అది అప్పుడు! ఆయన జీవించి ఉన్న కాలంలో!! ఆ పెదరాయుడి స్థానం, ఆయన దివంగతుడవటంతో ఖాళీ ఏర్పడింది. మరిప్పుడు సినిమా పెద్దన్న ఎవరు? అదిగో.. ఆ సీటు కోసమే ఇప్పుడు చిరంజీవి-బాలకృష్ణ మధ్య, ‘తెర’వెనుక కనబడని పెనుగులాట జరుగుతోందా? ఎవరి అడుగులో కళామతల్లి ముద్దుబిడ్డలు నడవాలన్న దానిపై ఏకాభిప్రాయం కుదరకనే ఈ లడాయి.. మెగా తముళ్లు బడాయి మాటలు మాట్లాడుతున్నారా? మొత్తంగా తెలుగు సినీ పరిశ్రమ, ఒక దాసరి లాంటి పెదరాయుడు కోసమయితే ఎదురుచూస్తోంది. ఇది పక్కా! కాకపోతే అందరినీ సమన్వయపరిచే పెద్దన్న ఎవరన్నదే ఇప్పుడు పెద్ద పంచాయితీ!! అందుకే ‘సమరసింహారెడ్డి’ తొడకొడుతుంటే, సై.. ‘రా’ అంటూ మీసం మెలేసి సవాళ్లు విసురుకుంటున్నారా?.. అందుకే ముఖ్యమంత్రులను కలిసే యవ్వారం అంతా ముసుగులోనే జరుగుతోందా?.. ఈ తెరవెనుక ‘వేషాలు’ చూడాలంటే ఫిలింనగర్కు వెళ్లాల్సిందే.. వెళ్లొద్దాం రండి..
టాలీవుడ్లో ఎవరి దుకాణాలు వారివే..


దా‘సరిలేరు నీకెవ్వరూ’…




ఆ స్థానం కోసమే వెటరన్స్ ఆరాటం..
ఇప్పుడు దాసరి మాదిరిగా టాలీవుడ్ను తమ భుజస్కంధాలపై వేసుకునేందుకు, ఇద్దరు ‘వయసుమళ్లిన హీరోల’ మధ్య ఆసక్తికరమైన యుద్ధం జరుగుతోంది. దాసరి సామాజికవర్గానికే చెందిన మాజీ మెగాస్టార్, ప్రజారాజ్యం పార్టీ మాజీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎంపి, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. ప్రస్తుతం చిరంజీవికి సినిమాలు లేవు. అయితే, ఇది సుతరామూ నచ్చని, ఎమ్మెల్యే కమ్ హీరో నందమూరి బాలకృష్ణ ఒంటరిగానే ఆ ప్రయత్నాలను అడ్డుకుంటున్నారన్నది మరో టాక్. ఆ మాటకొస్తే బాలయ్య చేతిలో కూడా పెద్ద సినిమాలేవీ లేవు. అరవైఏళ్లు పూర్తి చేసుకున్న ఈ ఇద్దరూ వెటరన్సే.
దాసరి-చిరంజీవికి ఎప్పుడూ వైరమే..
నిజానికి చిరంజీవి-దాసరికి ఎప్పుడూ పొసగేది కాదు. ఇద్దరివీ భిన్నధృవాలు. అనేక వేదికలపైనా, ఇంటర్వ్యూలలో కూడా, దాసరి పరోక్షంగా చిరంజీవిపై వ్యాఖ్యలు చేసేవారు. చిరు పార్టీ స్థాపించిన సమయంలో దాసరి ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళంలో విజయం సాధించిన కత్తి సినిమాను తెలుగులో రీమేక్ చేసే విషయంలో, వారిద్దరి మధ్య ఏర్పడిన వివాదంపై సోషల్మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. ‘సినిమాల్లో ఎన్టీఆర్, రజీకాంత్, అమితాబ్ మాత్రమే సూపర్స్టార్లు. మిగిలినవారంతా ఉత్తి స్టార్లే’నని దాసరి, పరోక్షంగా చిరుపై సెటైర్లు సంధించారు. చిరు ప్రజారాజ్యం పెట్టిన తర్వాత ఆయనపై తీసిన మేస్త్రీ సినిమా అంతా చిరుపై సెటైర్లతోనే సాగడం సంచలనం సృష్టించింది. ‘స్టోరీలో దమ్ములేకుండా 150వ సినిమా అయినా ఆడద’ని బాంబు పేల్చారు. ‘అడ్రస్ లేని వాళ్లుకు అడ్రసిస్తే మిడిసిపడతున్నార’ని చేసిన దాసరి వ్యాఖ్య, అప్పట్లో సినీ పరిశ్రమను కుదిపేసింది. అంతకుముందు చిరంజీవి తన వల్లే పైకొచ్చారని దాసరి చాలా సార్లు చెప్పడాన్ని విస్మరించకూడదు. సినిమాల నుంచి లబ్ధిపొందిన వాళ్లు సినిమా పరిశ్రమకు ఏమీ చేయడం లేదని చిరుపై దాసరి మరో విమర్శనాస్త్రం సంధించారు. దీన్నిబట్టి వారిద్దరి మధ్య విబేధాలు ఏ స్థాయిలో ఉండేవో ఊహించుకోవచ్చు.
రాంచరణ్నూ వదలని దాసరి..

కాపు ఉద్యమంలో కీలకపాత్ర..
కాపు రిజర్వేషన్ ఉద్యమంలో దాసరి పాత్ర అనిర్వచనీయం. అలాంటి కాపు కార్డు గుర్తింపు ఉన్న తనను.. చిరంజీవి అదే కార్డుతో దాటివెళ్లడం, దాసరికి నచ్చేదికాదు. ఓసారి నేను పనిచేసిన ఓ పత్రికాధిపతితో కలసి, దాసరిని ఆయన నివాసంలో దాదాపు 2 గంటలు భేటీ అయ్యాం. రాజకీయాల్లో కులాల ఆధిపత్యం, సినిమా ముచ్చట్లు ఆ భేటీలో దొర్లాయి. ఆ సందర్భంలో చిరంజీవి తన పార్టీని విలీనం చేసి, తద్వారా తన కేంద్రమంత్రి పదవి కోసం ఆరాటపడుతున్నారని దాసరి మనసులోమాట బయటపెట్టారు. అందుకు గోల్డ్స్టోన్ ప్రసాద్ అనే వ్యక్తి, కాంగ్రెస్ హైకమాండ్తో మధ్యవర్తిత్వం చేస్తున్నాడన్నారు.
కాపులను కాంగ్రెస్ వైపు తీసుకువచ్చేందుకు తాను చేసిన కృషిని, దాసరి గుర్తు చేశారు. ఆ సందర్భంలో, వంగవీటి మోహన్రంగా-ముద్రగడ-కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వాలను ప్రస్తావించారు. చంద్రబాబు తనను గౌరవిస్తాడు కానీ అతనిని నమ్మలేమన్నారు. జూనియర్ ఎన్టీఆర్కు రాజకీయ భవిష్యత్తు ఉందని అంచనా వేశారు. ఈ సమయంలో ఒక రాజకీయ పార్టీ అవసరం ఉందని, కాపు-బీసీలు కలిస్తే అధికారం ఖాయమని చెప్పారు. ఇంకా ఈవిధంగా చాలా వ్యాఖ్యలు, మా సంభాషణలో దొర్లాయి. ఆ తర్వాత ముద్రగడ ఉద్యమం, ఆందోళన విషయంలో మాత్రం దాసరి-చిరంజీవి ఒకే వేదికపైకి వచ్చారు.
బాలయ్య ఫైర్తో సీన్ రివర్స్..


అయితే, దీనిపై ఆగ్రహించిన నందమూరి బాలకృష్ణ.. ఆ సమావేశానికి తనను పిలవలేదని, వాళ్లంతా స్థలాల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం తలసాని శ్రీనివాసయాదవ్ను కలిశారని చేసిన వ్యాఖ్య సంచలనం సృష్టించింది.ఇది కూడా చదవండి.. చిరంజీవి,బాలకృష్ణ.. మధ్యలో తలసాని!దీనితో పలువురు హీరోలు, నటులు బాలయ్యను కలసి అంతర్గతంగా తమ మద్దతు ప్రకటించారు. ఈలోగా చిరంజీవి సోదరుడు నాగబాబు కూడా.. బాలయ్య క్షమాపణ చెప్పాలంటూ చేసిన ట్వీట్ బాలయ్య అభిమానులకు ఆగ్రహం కలిగించింది. ఆ తర్వాత కూడా నాగబాబు వరసగా బాలయ్యపై తన యూ ట్యూబ్ చానెల్, ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఈ ఘటన తె లుగు సినిమా పరిశ్రమలో ఉన్న చీలికను స్పష్టం చేసింది.ఇది కూడా చదవండి.. గ్యాంగ్ లీడర్లా..? బ్యాండ్ లీడర్లా?
అమరావతి ప్రస్తావన లేకుండానే ఏపీకి..
మళ్లీ కొద్దిరోజుల క్రితం ఇదే బృందం ఏపీ సీఎం జగన్ను కలిసింది. అందులో కూడా బాలయ్య లేరు. అదేరోజు తన పుట్టినరోజు ఉన్నందున రాలేకపోతున్నానని, చిరంజీవికి చెప్పినట్లు భోగట్టా. అయితే, మా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శితోపాటు, ఎక్కువ సినిమాలు చేస్తున్న ప్రస్తుత హీరోలు, నిర్మాతలు లేకుండానే.. చిరంజీవి కొంతమందిని ఎంపిక చేసుకుని, కేసీఆర్-జగన్ వద్దకు తీసుకువెళ్లడంపై ఆగ్రహం వ్యక్తమవుతోందట. అయితే, రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతునివ్వాలని కోరుతూ, చిరు బృందం ఉన్న గెస్ట్హౌస్కు రైతులు వెళ్లారు. సిని‘మా’కు తప్పని రాజధాని సెగ కానీ వారెవరూ రైతులను కలవకుండానే సీఎం వద్దకు వెళ్లారు. దీనిపై ఆగ్రహించిన రైతులు, అమరావతి వద్దు గానీ అమరావతిలో భూములు కావాలా అని విరుచుకుపడ్డారు. ఇది కూడా చదవండి.. రాజధానిపై సినిమా స్టార్లు మాట్లాడరేం?
చిరుకు పెదరాయుడు కిరీటం దక్కదా?

