హైదరాబాద్: కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్
పాజిటివ్ వచ్చినవారంతా కోలుకుంటున్నారు. ప్రజలు చెప్పినట్టు వినకపోతే కర్ఫ్యూ విధించాల్సి
వస్తుంది. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుంది. అప్పటికీ వినకపోతే ఆర్మీ రంగంలోకి
దిగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. కరోనా కట్టడి చర్యలు, లాక్డౌన్
పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారు.
సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు ఉన్న కేసులు
ఏప్రిల్ 7 కల్లా కోలుకొని డిశ్చార్జ్ అవుతారు. రాష్ట్రంలో
ఇప్పటి వరకు 36 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 114
మంది కరోనా అనుమానితులు ఉన్నారు. స్వతహాగా
నియంత్రణ పాటించి ఎక్కడి వారు అక్కడ ఉండాలి.
రాష్ట్రంలో 19,313 మందిపై నిఘా ఉంది. నిఘాలో ఉన్న
వ్యక్తుల పాస్పోర్టులు సీజ్ చేయాలని చెప్పాం. అప్రమత్తతే
మనల్ని కాపాడుతుంది. ప్రజలు వందశాతం సహకరించాలి.
అమెరికా లాంటి దేశంలో కూడా ఆర్మీని రంగంలోకి దించారు. పరిస్థితి చేయిదాటితే షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రజలు సహకరించకుంటే ఆర్మీని దించాల్సి వస్తుంది.షూట్ ఎట్సైట్ ఆర్డర్స్ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. జాగ్రత్తగా ఉండి ప్రభుత్వానికి సహకరించాలి.కరోనా మీద అవగాహన తెచ్చే క్రమంలో పాజిటివ్ డైరెక్షన్లో ముందుకు పోవాలి. ఈ సమయంలోనే నాయకులు ప్రజల కోసం పనిచేయాలి.
మంత్రులంతా జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లో
ఉండాలి. వ్యవసాయ, వైద్య, మున్సిపల్ మంత్రులు అటుఇటు తిరగాల్సి ఉంటుంది. మనకు
కరోనా ప్రభావం అంతగాలేదు అయినా సీరియస్గా తీసుకుంటున్నాం. కరోనా సోకని దేశం లేదని
రిపోర్టులు వచ్చాయి. నిర్మల్లో క్వారంటైన్ నుంచి ఒక వ్యక్తి ౩ సార్లు తప్పించుకున్నాడు. మన
దగ్గర కరోనా అనుమానితుల సంఖ్య 114. ఇది ప్రత్యేక పరిస్థితి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.
అమెరికా లాంటి దేశంలో కూడా ఆర్మీని రంగంలోకి దించారు. పరిస్థితి చేయిదాటితే షూట్ ఎట్సైట్ ఆర్డర్ వస్తుంది. ప్రజలు సహకరించకుంటే ఆర్మీని దించాల్సి వస్తుంది. షూట్ ఎట్సైట్ ఆర్డర్స్ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. నిఘాలో ఉన్న వ్యక్తుల పాస్పోర్టులు సీజ్ చేయాలని చెప్పామని సీఎం పేర్కొన్నారు.
అధిక రేట్లకు అమ్మితే జైలుకు పంపుతాం: సీఎం కేసీఆర్
‘కూరగాయల ధరలు పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఎక్కువ ధరకు అమ్మితే పీడీయాక్ట్ పెట్టి జైలుకు పంపుతాం. లైసెన్స్లు రద్దు చేసి..షాపులు సీజ్ చేస్తాం. అధిక ధరలకు విక్రయిస్తే పర్మనెంట్గా బ్లాక్లిస్టులో పెడతాం. అత్యవసర సమస్యలు వస్తే డయల్ 100కు ఫోన్ చేయండి.’ అని సీఎం కేసీఆర్ సూచించారు.
రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. సాయంత్రం 6 గంటల కల్లా అన్ని దుకాణాలు మూసేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. ఈ సమస్య ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో ఎవరికీ తెలియదు. టోల్ ప్లాజాల దగ్గర ఈ రాత్రికి మినహాయింపు ఇస్తాం.. ఉదయానికంతా వారు గమ్యస్థానాలకు చేరుకోవాలి. రైతులు మార్కెట్ కమిటీలకు రావొద్దు.. మీ ఊళ్లలోనే కూపన్స్ ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు మార్కెట్ యార్డ్కి రావొద్దు.
గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో అంతా బాగుంది. ప్రజలు పోలీసులకు సహకరించకపోతే 24 గంటల కర్ఫ్యూ పెట్టాల్సి వస్తుంది. ప్రతి చెక్పోస్ట్ దగ్గర ప్రజాప్రతినిధులు ఉండాలి. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు కూడా చేసుకోవచ్చు. లేబర్ ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పాం. చాలా గ్రామాలు కంచెలు వేసుకున్నాయి. గ్రామ పంచాయతీలలో ఉన్న స్టాండింగ్ కమిటీ సభ్యులంతా రంగంలోకి దిగాలి. ప్రతి సర్పంచ్ ఆ గ్రామానికి కథానాయకుడు కావాలని సీఎం కేసీఆర్ సూచించారు
[…] పరిమితం కావాలని కోరుతున్నారు. షూట్ ఎట్ సైట్ పరిస్థితి తెచ్చుకోవ… .కానీ వివిధ మత ప్రచారకులు అందుకు […]