415కు పెరిగిన కరోనా కేసులు

ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ చేస్తున్నాయి. మొన్నటి వరకు పెద్దగా మనదేశంలో కరోనా ఎఫెక్ట్ కనిపించలేదు. గత రెండు రోజులుగా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.
రెండు రోజుల్లోనే పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. ఈరోజు ఉదయానికి 415 పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ పేర్కొన్నది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో కరోనా వైరస్ మూడో దశకు చేరుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు అందరిని భయపెడుతున్నది. ఒకవేళ మూడు దశలోకి ప్రవేశిస్తే ఆపడం చాలా కష్టం అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నది.