ఏపీలో ఆరు వారాల పాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా.
పంచాయతీ ఎన్నికల పై కరోనా వైరస్ ప్రభావం.
సాధారణ పరిస్థితులు నెలకొన్న అనంతరం ఎన్నికల తేదీల ప్రకటన
ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారు.
ఇప్పటవరకూ జరిగిన ప్రక్రియ రద్దు కాదు.
అత్యున్నత స్థాయి సమీక్ష తరువాతనే ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడి
— అత్యంత హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్ల, ఎస్పీలనును విధుల నుంచి తప్పించాలని ఈసీ ఆదేశం
— మాచర్ల ఘటనలో సీఐను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశం.
— కొంతమంది పోలీసు అధికారులపై చర్యలకు ఈసి ఆదేశం
— శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలను,తిరుపతి,పలమనేరు, తాడిపత్రి రాయదుర్గం సిఐలను బదిలీ చేయాలని ఆదేశం
— తిరుపతి, మాచర్ల, పుంగనూరులో అవసరమైతే ఎన్నికలను రద్దుచేసేందుకు పరిశీలన
— మహిళా అభ్యర్దులు, బీసీ అభ్యర్దులను ఇబ్బంది పెట్టారు. ఇది తీవ్రంగా పరిగణిస్తున్నాము.
— ఆరు వారాల తర్వాత దీనిపై ఖచ్చితంగా ఓ నిర్ణయం తీసుకుంటాం.